మిజోరంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం : ఎంఎన్‌ఎఫ్‌

11 Dec, 2018 16:41 IST|Sakshi

ఐజ్వాల్‌ : మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్ధానాలకు గాను మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌) 24 స్ధానాల్లో గెలుపొందిన మిజో నేషనల్‌ ఫ్రంట్‌ స్పష్టమైన మెజారిటీ సాధించింది. మిజోరంలో తమ పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, తాము యూపీఏలో చేరబోమని ఎంఎన్‌ఎఫ్‌ అధ్యక్షుడు జోరంతంగా తెలిపారు.

తాము నార్త్‌ఈస్ట్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌, ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంటామని చెప్పారు.తమ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే మద్య నిషేధం విదించడంతో పాటు రహదారుల మరమ్మత్తులు, సామాజికార్ధిక కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడమే అజెండాగా పనిచేస్తామన్నారు.

మరిన్ని వార్తలు