మోదీ మోదీ ఎస్‌పాపా.. నర్సరీ రైమ్‌ వైరల్‌

8 May, 2019 20:29 IST|Sakshi

మోదీపై రైమ్‌ రచించిన ఆర్జేడీ

పట్నా: ఎన్నికల వేళ రాజకీయ పార్టీల విమర్శలు సర్వసాధారణమే. కానీ ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్జేడీ వ్యంగ్యంగా ఓ రైమ్‌ను రచించింది. ఎల్‌కేజీ, యూకేజీ చదువుతున్న పిల్లలు పాడుకునే జానీ.. జానీ ఎస్‌పాపా అనే ఐకానిక్ నర్సరీ రైమ్ అందరూ వినే ఉంటారు. అలాంటి రైమ్‌నే మోదీపై రచించారు. మోదీ మోదీ ఎస్‌పాపా అంటూ.. ఐదేళ్ల బీజేపీ పాలనను ఎండగడుతూ ఓ రైమ్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘‘మోదీ మోదీ ఎస్‌పాపా.. ఫార్మర్‌ హ్యాపీ నో పాపా. ఉమెన్‌ సేఫ్టీ నో పాపా, 15 లక్షలు నోపాపా, అంటూ... రైమ్‌ ద్వారా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిని ఆర్జేడీ పార్టీ అధికార ట్విటర్‌​ ఖాతాలో బుధవారం పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది. కాగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బిహార్‌లో రాజకీయం ఉత్కంఠంగా మారిన విషయం తెలిసిందే. 40 లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రంలో విజయం కోసం ఓ వైపు బీజేపీ.. మరోవైపు కాంగ్రెస్‌-ఆర్జేడీ కూటమి హోరాహోరీ పోటీపడుతున్నాయి.

>
మరిన్ని వార్తలు