ఆరెస్సెస్‌తో టచ్‌లో ఉండండి: బీజేపీ

24 Sep, 2018 06:29 IST|Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ బూత్‌ స్థాయి కార్యకర్తలు, నేతలు క్రమం తప్పకుండా ఆరెస్సెస్‌ శ్రేణులతో సంప్రదింపులు జరపాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. కొన్ని రోజుల క్రితం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ అగ్ర నాయకత్వం ఈ సూచనలు చేయగా ఆదివారం ఈ విషయం వెల్లడైంది. గతవారం ఢిల్లీలో ఆరెస్సెస్‌ మూడు రోజులపాటు నిర్వహించిన సదస్సులో ఆ సంస్థ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ మాట్లాడుతూ రాజకీయ పార్టీ కోసం పనిచేయాలని తాము ఆరెస్సెస్‌ కార్యకర్తలకు ఎప్పుడూ చెప్పలేదనడం గమనార్హం

మరిన్ని వార్తలు