హైదరాబాదుకు ధీటుగా నల్గొండ అభివృద్ధి: కోమటిరెడ్డి

25 Jan, 2020 19:38 IST|Sakshi

సాక్షి, నల్గొండ: అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు తెలివితో ఓటు వేశారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ: నల్గొండ ఎమ్మెల్యే పోలింగ్‌ రోజున అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ నేతల మాటలను ప్రజలు నమ్మలేదన్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పారని,  కేసీఆర్‌ సర్కారుకు ఈ ఫలితాలు చెంపపెట్టు అంటూ విమర్శించారు. కాగా నల్గొండలో కాంగ్రెస్‌ నాలుగవ సారి జెండా ఎగరవేసిందని, హైదరాబాదుకు ధీటుగా నల్గొండను అభివృద్ధి చేస్తామన్నారు. భువనగిరి పార్లమెంట్‌ పరిధిలో కాంగ్రెస్‌కు ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస​ ఓటింగ్‌ పార్లమెంటు ఎన్నికల కంటే మున్సిపల్‌ ఎన్నికల్లో పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. మైనార్టీ సోదరులు కాంగ్రెస్‌ను అక్కున చేర్చుకున్నారని ఎంపీ వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు