‘పార్టీకి ప్రియాంకే దిక్సూచీ’

8 Jul, 2019 18:05 IST|Sakshi

భోపాల్‌ : కాంగ్రెస్‌ చీఫ్‌గా ప్రియాంక గాంధీయే సరైన ఎంపిక అని మధ్యప్రదేశ్‌ ప్రజా పనుల శాఖ మంత్రి సజ్జన్‌ సింగ్‌ వర్మ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరాజయానికి పూర్తి బాధ్యత వహిస్తూ పార్టీ చీఫ్‌గా వైదొలిగిన నేపథ్యంలో పార్టీ నేత ఈ వ్యాఖ్యలు చేయడం​గమనార్హం. కాంగ్రెస్‌ పార్టీకి ప్రస్తుతం పోరాట పటిమ కలిగిన ప్రియాంక గాంధీ వంటి మెరుగైన నేత అవసరమని వర్మ పేర్కొన్నారు.

బీజేపీని దీటుగా ఎదుర్కొని పార్టీని ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడవేసే సామర్థ్యం​ఆమెకు ఉందని అన్నారు. తమ కుటుంబం నుంచి పార్టీ నాయకత్వాన్ని ఎవరూ స్వీకరించాలని రాహుల్‌ కోరుకోవడం లేదనే వార్తలను ప్రస్తావిస్తూ నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులు లేకుండా కాంగ్రెస్‌ను ఊహించలేమని అన్నారు. రాహుల్‌ పార్టీకి సలహాదారుగా ఉండి, గతంలో జరిగిన పొరపాట్లను చక్కదిద్దే పాత్రను పోషించాలని వర్మ సూచించారు.

మరిన్ని వార్తలు