‘వెంకన్న చౌదరి’ బీజేపీని అడ్డుకున్నాడు : ఎంపీ

24 May, 2018 10:53 IST|Sakshi
టీడీపీ సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ మురళీ మోహన్‌

సాక్షి, హైదరాబాద్‌ : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎంపీ మురళీ మోహన్‌ ‘వెంకన్న చౌదరి’ అని సంబోధించారు. కర్ణాటక ఎన్నికల్లో రకరకాల మతలబులు చేసినప్పటికీ  భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి మెజార్టీ రాకపోవడానికి కారణం మా తిరుమల తిరుపతి వెంకన్న చౌదరి అంటూ వ్యాఖ్యానించారు.

రాజమండ్రిలో పార్టీ నేతల సమావేశం సందర్భంగా  మురళీమోహన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఎన్నికలు అయిన తర్వాత చంద్రబాబుకు చుక్కలు చూపిస్తామని బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆకాశంలో కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నా చంద్రుడు మాత్రం ఒక్కడే అనే విషయం గుర్తు పెట్టుకోవాలని మురళీమోహన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు