టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్‌రావు

28 May, 2019 02:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కుర్మయ్యగారి నవీన్‌రావు పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ఖరారు చేశారు. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి, నవీన్‌రావులకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక ఖాళీ ఏర్పడటంతో నవీన్‌రావును ఎంపిక చేశారు. త్వరలో ఖాళీ కానున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో గుత్తాకు అవకాశం ఇస్తామని కేసీఆర్‌ స్పష్టంచేశారు. కాగా, మంగళవారం ఉదయం 11 గంటలకు నవీన్‌రావు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.   

మరిన్ని వార్తలు