‘మేం ఎవ్వరం అమ్మని కలవలేదు.. అంతా శశికళే..’

25 Dec, 2017 17:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమ్మ(జయలలిత)కు ఇన్‌ఫెక్షన్‌ కాకూడదని మంచి ఉద్దేశంతో మేం ఒక్కరం కూడా అమ్మను చూసేందుకు వెళ్లలేదు. ఎందుకంటే మేం ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకున్నాం. కానీ వాళ్లు మాత్రం ప్రతి రోజు వెళ్లి చూసొచ్చి అమ్మ కోలుకుంటోంది.. తింటోంది అని చెప్పేవాళ్లు. మేం ఆ మాటలు విని సరే అనుకునే వాళ్లం’ అని తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం చెప్పారు.

ఆర్కే నగర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్‌ చేతుల్లో తమ అభ్యర్థి ఘోరంగా ఓటమిపాలయిన సందర్భంగా సోమవారం అన్నాడీఎంకే ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా పన్నీర్‌ మీడియాతో మాట్లాడారు. ​‍‘ఒక్క మంత్రి కూడా అమ్మను ప్రత్యక్షంగా కలవలేదు. ప్రతిసారి నర్సు.. వారే (శశికళ కుటుంబ సభ్యులు) వెళ్లి వస్తుండేవారు’ అని పన్నీర్‌ సెల్వం చెప్పారు. జయలలిత పోర్ట్‌ఫోలియోకు ఎంతటి విలువిచ్చారో అంతే గౌరవాన్ని తాను కాపాడానని చెప్పారు.

మరిన్ని వార్తలు