'వందేమాతరం పాడం.. జనగణమనే..' 

6 Dec, 2017 17:08 IST|Sakshi

లక్నో : మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశాల ప్రారంభానికి ముందు వందేమాతరం పాడబోమని మీరట్‌ మేయర్‌ బీఎస్పీకి చెందిన సునీతా వర్మ స్పష్టం చేశారు. భారత జాతీయ గీతం జనగణమన అని ఆ గీతాన్నిమాత్రమే ఆలపిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో మీరట్‌, అలీఘడ్‌ ప్రాంతాల్లో బీఎస్పీ విజయాన్ని సొంతం చేసుకుంది.

అయితే, ఈ ప్రాంతాల్లో సమావేశాల ప్రారంభ సమయంలో వందేమాతరం ఆలపించాలని గతంలో పనిచేసిన మేయర్లు షరతు పెట్టగా కొత్తగా ఎన్నికైన సునీతా ఆ విధానాన్ని నిరాకరించారు. కేవలం తాము జనగణమన మాత్రమే ఆలపిస్తామని స్పష్టం చేశారు. దీనిపై ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేసినా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు నిరాకరించారు. ముఖ్యంగా బీజేపీ నేతలు సునీతా వర్మ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నారు.

మరిన్ని వార్తలు