‘ఆరెంజ్‌ పాస్‌పోర్ట్‌’.. బీజేపీ వివక్షే: రాహుల్‌

15 Jan, 2018 04:17 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇమిగ్రేషన్‌ చెక్‌ అవసరం ఉన్న పాస్‌పోర్ట్‌ హోల్డర్లకు ఆరెంజ్‌ రంగు పాస్‌పోర్డు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. బీజేపీ వివక్షాపూరిత ఆలోచనా ధోరణిని ఇది సూచిస్తోందని విమర్శించారు. ‘వలస కార్మికులను రెండో తరగతి పౌరులుగా బీజేపీ పరిగణించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ చర్యలు బీజేపీ వివక్షాపూరిత ఆలోచన ధోరణిని సూచిస్తున్నాయి’ అని ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు