మీకు మద్దతిస్తే.. మా అమ్మను తిట్టించారు: పవన్‌

15 Oct, 2018 18:19 IST|Sakshi
పవన్‌ కల్యాణ్‌

పంచాయతీలో గెలవని వ్యక్తి పంచాయతీ మంత్రి 

జన్మ భూమి కమిటీలా? గూండా కమిటీలా?

జనసేన కవాతులో పవన్‌ ఫైర్‌

సాక్షి, ధవళేశ్వరం : పంచాయతీ ఎన్నికల్లో పోటీచేయని లోకేష్‌ను పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రిగా చేశారని జనసేన అధ్యక్షడు పవన్‌ కల్యాణ్‌ ఎద్దేవా చేశారు. రాజమండ్రి, ధవళేశ్వరంలో జరిగిన జనసేన కవాతులో ఆయన పాల్గొని ఉద్వేగంగా ప్రసంగించారు. లోకేష్‌ను సీఎం చేయడానికేనా? తను జనసేన పార్టీ పెట్టిందని ప్రశ్నించారు. తను మాట్లాడితే సినిమా నటుడుంటున్నారని, మరి లోకేశ్‌కు ఎం తెలుసని నిలదీశారు. నిరుద్యోగ సమస్యతో యువత రగిలిపోతున్నారని, ఉద్యోగాల హామీ ఏమైంది చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ప్రజలు జన్మభూమి కమిటీలు దోచుకుంటున్నాయని చెబుతున్నారని, అవి జన్మ భూమి కమిటీలా? లేక గూండా కమిటీలా? అని మండిపడ్డారు. 

తను చంద్రబాబుకు మద్దతిస్తే.. ఆయన మాత్రం తనను, తన తల్లిని తిట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లోనే తమకు బలం ఉందని, ఓట్లు చీల్చి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేయలేక పోటీ చేయలేదన్నారు. చంద్రబాబుకు మద్దతిచ్చినా పదువులు అడగలేదన్నారు. రాష్ట్రానికి మంచి పాలన ఇవ్వాలనే చంద్రబాబును కోరానని తెలిపారు. కానీ ఆయన తన పార్టీ ఆఫీసుకు అనుమతివ్వలేదన్నారు. అవినీతిపై మాట్లాడితే తను మారానంటున్నారని, ఎప్పుడూ టీడీపీ పల్లకిని మోస్తూనే ఉండాలా అని ప్రశ్నించారు. సంతలో పశువుల్లా ప్రతిపక్షనేతలను అధికార పార్టీలు కొంటున్నాయని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు