25 నుంచి ‘పశ్చిమ’లో పవన్‌ యాత్ర

22 Sep, 2018 04:55 IST|Sakshi

సాక్షి, అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఈ నెల 25వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తారని ఆ పార్టీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పర్యటనలో పవన్‌కల్యాణ్‌ పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని పేర్కొన్నారు. కాగా, ఈ నెల 23న రొట్టెల పండుగలో పాల్గొనేందుకు పవన్‌కల్యాణ్‌ నెల్లూరులో పర్యటిస్తారని ప్రకటనలో తెలిపారు.  

మరిన్ని వార్తలు