బీజేపీ, కాంగ్రెస్‌లను ఓడించాలి

4 Apr, 2018 03:04 IST|Sakshi

 ప్రతిజ్ఞకు పిలుపునిచ్చిన పిడమర్తి రవి 

సాక్షి, న్యూఢిల్లీ: మాదిగల అస్తిత్వ నినాదమైన ఎస్సీ వర్గీకరణను పట్టించుకోని బీజేపీ, కాంగ్రెస్‌లను ఓడించాలని, ఈ నెల 14న మాదిగలు ప్రతిజ్ఞ చేయాలని తెలంగాణ మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు పిడమర్తి రవి మంగళవారం పిలుపునిచ్చారు.

రాష్ట్రంలోని మాదిగ సంఘాలన్నీ ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా స్వీకరించాలని, కాంగ్రెస్, బీజేపీలు చేసే మోసాన్ని పల్లెపల్లెకూ చేరవేయాలని కోరారు. తెలంగాణ భవన్‌లో ‘ఎస్సీ వర్గీకరణ’అనే అంశంపై మంగళవారం సెమినార్‌ నిర్వహించినట్టు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు