జయనగరలో పోలింగ్‌ ప్రశాంతం

12 Jun, 2018 02:47 IST|Sakshi

జయనగర: బెంగళూరులోని జయనగర నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికలో 55 శాతం పోలింగ్‌ నమోదైంది. జయనగర బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ అకస్మికంగా చనిపోవడంతో ఇక్కడ మే 12న జరగాల్సిన ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఈ ఎన్నికలో బీజేపీ తరఫున విజయ్‌ సోదరుడు ప్రహ్లాద, కాంగ్రెస్‌ తరఫున మాజీ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్య పోటీ పడ్డారు. కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సౌమ్యాకు జేడీఎస్‌ మద్దతు ప్రకటించింది. జూన్‌ 13న ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.

మరిన్ని వార్తలు