పుదుచ్చేరి మాజీ సీఎం కన్నుమూత

10 Jun, 2019 10:04 IST|Sakshi

పాండిచ్చేరి:  డీఎంకే నాయకుడు, పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి ఆర్వీ జానకిరామన్‌ (78) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం మృతిచెందినట్ల ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఐదుసార్లు పుదుచ్చేరి శాసనసభకు ఎన్నికైన జానకీరామన్‌.. 1996-2000 మధ్య కాలంలో సీఎంగా వ్యవహరించారు.  అనంతరం 2001 నుంచి 2006 వరకు ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు. పుదుచ్చేరి డీఎంకే కన్వీనర్‌గా కూడా పదవులు చేపట్టారు. చివరిగా 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చవిచూశారు. ఈ తరువాత ఎన్నికలకు దూరంగా ఉన్నారు.  1941 జనవరి 8న పుదుచ్చేరిలో జన్మించిన రామన్‌.. రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్నారు. ఆయన మృతిపట్ల డీఎంకే నేతలు, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు