పొత్తుల్లో సందిగ్ధతే కారణం: పొన్నాల

15 Nov, 2018 05:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రజా కూటమిలోని మిత్రప క్షాల మధ్య పొత్తుల విష యంలో ఏర్పడిన సంది గ్ధత వల్లే జనగాం సీటు ప్రకటన విషయంలో ఆలస్యమవుతోంది తప్ప.. తనకు సీటు ఇవ్వాలా వద్దా అన్న విషయంలో కాదని మాజీ పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. ఢిల్లీలో బుధ వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనగాం నుంచి పోటీ చేసేది తానేనని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. పొత్తుల విషయంలో ఏర్పడిన సందిగ్ధతను పరిష్కరించడంలో ఆలస్యమవు తోందన్నారు. ఇక కొత్తగా వచ్చిన ఓ రాజకీయ పార్టీ కూడా జనగాం నుంచే పోటీ చేస్తామన డంపై ముందుగా తేల్చాలన్నారు.

మరిన్ని వార్తలు