ప్రజాసంకల్పయాత్ర రూట్‌ పరిశీలన

17 May, 2018 07:22 IST|Sakshi
తాడేపల్లిగూడెం పోలీసు ఐ ల్యాండ్‌ ప్రాంతంలో జగన్‌ ప్రజాసంకల్పయాత్ర రూట్‌ పరిశీలిస్తున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, తాడేపల్లిగూడెం, భీమవరం కో–ఆర్డినేటర్లు కొట్టు సత్యనారాయణ, గ్రంధి శ్రీనివాస్‌

పశ్చిమగోదావరి,తాడేపల్లిగూడెం:వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి ప్రజా సంకల్పయాత్రలో భాగంగా తాడేపల్లిగూడెం నియోజవర్గంలో పర్యటించే రూట్‌ను బుధవారం పార్టీ నాయకులు పరిశీలించారు. బహిరంగ సభ నిర్వహించే పోలీసు ఐ ల్యాండ్‌ ప్రాంతంలో వేదిక, ఇతర ఏర్పాట్ల గురించి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్‌ కొట్టు సత్యనారాయణ చర్చించారు. అక్కడి నుంచి బ్రహ్మానందరెడ్డి మార్కెట్‌ వరకు కొంత దూరం నడిచి రహదారి పరిసరాలు.

తదితర విషయాల గురించి చర్చించారు. పెంటపాడులో బస, ముఖాముఖి కార్యక్రమాల గురించి రఘురాం మాట్లాడారు. నియోజకవర్గంలో పర్యటించే రోజుల్లో రాత్రి బస ఇతర ఏర్పాట్ల గురించి చర్చించారు. దీనికనుగుణంగా కొన్ని ప్రాంతాలను ఎంపిక చేశారు. రూట్‌ను పర్యవేక్షించే రఘు ఈ ప్రాంతాల ఎంపిక బాగుందన్నారు. కొట్టుతో పాటు భీమవరం నియోజకవర్గ కన్వీనర్‌ గ్రంధి శ్రీనివాస్, పార్టీ గూడెం నాయకులు గుండుబోగుల నాగు, నిమ్మల నాని, కర్రి సుధాకర రెడ్డి, బండారు నాగు, కిషోర్, ఉంగరాల శ్రీను, కొల్లాటి బాలాజీ తదితరులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు