65వ రోజు ముగిసిన ప్రజాసంకల్పయాత్ర

18 Jan, 2018 19:37 IST|Sakshi

సాక్షి, చిత్తూరు : ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర  65వ రోజు చిత్తూరు జిల్లాలోని సదాశివపురం క్రాస్‌ వద్ద ముగిసింది. నేడు వైఎస్‌ జగన్‌ 8 కిలో మీటర్లు నడిచారు.

గురువారం ఉదయం 8.30 గంటలకు వైఎస్ జగన్‌ వికృతమాల నుంచి పాదయాత్రను ప్రారంభించి, గోవిందాపురం, చెల్లురు క్రాస్‌, ములకండ్రిగ, ఎండీ పుత్తుర్‌, మడిబాక క్రాస్‌, రాజుల కండ్రిగ మీదుగా సదాశివపురం క్రాస్‌ వరకూ ఈరోజు పాదయాత్ర సాగింది. ఇప్పటివరకు వైఎస్‌ జగన్‌ 883.6 కిలోమీటర్లు నడిచారు.

మరిన్ని వార్తలు