సాక్షి, హైదరాబాద్ : ప్రజాసమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వ అసమర్ధతను ఎండగడుతూ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజాసంకల్పయాత్ర 113వ రోజు షెడ్యూల్ను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం బుధవారం మీడియాకు విడుదల చేశారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం పొన్నూరు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి కసుకర్రుకు చేరుకుంటారు. అనంతరం వల్లభారావుపాలెం వరకూ పాదయాత్ర కొనసాగనుంది.
112వ రోజు ముగిసిన పాదయాత్ర
జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 112వ రోజు ప్రజాసంకల్పయాత్రను ముగించారు. అప్రతిహతంగా సాగుతున్న పాదయాత్రలో 112వ రోజు 1500 కి.మీల మేర నడకను వైఎస్ జగన్ పూర్తి చేశారు.