127వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

3 Apr, 2018 09:22 IST|Sakshi

సాక్షి, గుంటూరు : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 127వ రోజుకు చేరుకుంది. మంగళవారం ఆయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీరామ్‌ నగర్‌ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి చుట్టుగుంట, అంకమ్మ నగర్‌, ఎత్తురోడ్‌ సెంటర్‌, నల్లచెరువు, మూడు బొమ్మల సెంటర్‌, ఫ్రూట్‌ మార్కెట్‌, జిన్నాటవర్‌ సెంటర్‌ నుంచి కింగ్‌ హోటల్‌ వరకూ పాదయాత్ర కొనసాగుతుంది.

మరిన్ని వార్తలు