223వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

28 Jul, 2018 20:08 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి :  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 223వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత ఆదివారం ఉదయం జగ్గంపేట నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు.

అక్కడి నుంచి రామవరం, గొనేడ, రామచంద్రాపురం వరకూ పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

>
మరిన్ని వార్తలు