పెరంబూరు: సొంతంగా రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని బహుభాషా నటుడు ప్రకాశ్రాజ్ తెలిపారు.ఆయన ఇక్కడ మాట్లాడుతూ తాను తలచిన లక్ష్యం కోసం పోరాడుతూనే ఉంటానని అన్నారు. బెంగళూరు ప్రజల హక్కు కోసం తన గొంతు వినిపిస్తానన్నారు. స్వతంత్ర అభ్యర్థి కావడంతో ప్రజలకు–తనకు మధ్య గ్యాప్ ఏర్పడిందని అంటున్నారని, అందుకే త్వరలోనే సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మరో ఏడాదిలో బెంగళూర్లో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయని, ఆ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులను పోటీకి నిలిపి ప్రజా మద్దతు పొందనున్నట్లు తెలిపారు. తాను రాజకీయ పార్టీని ప్రారంభించినా, సినిమాల్లో నటించడం మానుకోనని, పార్టీని నడపడానికి డబ్బు అవసరం అవుతుందని, అందుకే నటనను కొనసాగిస్తానని ఆయన చెప్పారు.