మళ్లీ కౌంటర్‌ వేసిన ప్రకాశ్‌ రాజ్‌

22 Jan, 2018 14:01 IST|Sakshi

సాక్షి, బెంగళూర్‌ : సీనియర్‌ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ మరోసారి ట్విటర్‌ లో కౌంటర్‌ వేశారు. కేంద్ర మంత్రి సత్యపాల్‌ సింగ్‌ కు ఈ విలక్షణ నటుడు సూటిగా చురకలు అంటించాడు. 

‘‘మనిషి కోతి నుంచి పుట్టాడన‍్న విషయాన్ని మన పూర్వీకులు చూడలేదని మంత్రిగారు చెబుతున్నారు. కానీ, అయ్యా.. అందుకు భిన్నమైన పరిస్థితులను మనం ఇప్పుడు చూస్తున్నామన్న విషయాన్ని మీరు అంగీకరించకుండా ఉండగలరా?  మనిషి కోతిలాగా మారి గతాన్ని తవ్వుతూ మళ్లీ రాతి యుగం కాలం నాటికి తీసుకెళ్తున్నాడు’’ అంటూ ప్రకాశ్‌ రాజ్‌ మంత్రిని ఉద్దేశించి ఈ ఉదయం ఓ ట్వీట్‌ చేశారు. 

కాగా, ఛార్లెస్‌ డార్విన్‌ ప్రతిపాదించిన జీవపరిణామక్రమ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సత్యపాల్‌ సింగ్‌ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మానవజాతి భూమి మీద అలాగే ఉండేదని.. కాబట్టి డార్విన్‌ సిద్ధాంతం పూర్తిగా తప్పని ఆయన చెప్పారు. తక్షణమే ఈ సిద్ధాంతాన్ని కళాశాలలు, పాఠశాలల్లో అధ్యాపకులు బోధించడం ఆపాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రిని ట్రోల్‌ చేస్తూ కొందరు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మరిన్ని వార్తలు