తొగాడియా కొత్త హిందూ పార్టీ

25 Jun, 2018 03:31 IST|Sakshi

న్యూఢిల్లీ: విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) బహిష్కృత నేత ప్రవీణ్‌ తొగాడియా అంతర్‌రాష్ట్రీయ హిందూ పరిషత్‌ (ఏహెచ్‌పీ) పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. వీహెచ్‌పీ నుంచి బహిష్కరణకు గురైన తొగాడియా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ‘హిందూ ప్రత్యామ్నాయం’గా తమ పార్టీ పనిచేస్తుందని చెప్పారు. ‘2014 ఎన్నికల్లో బీజేపీ వెన్నంటి ఉండి గెలిపించిన హిందువులను మోదీ ప్రభుత్వం వంచించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం లేదు.  యువతకు మాట ఇచ్చినట్లు 10 కోట్ల ఉద్యోగాలు రాలేదు. రైతులు రోజూ ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు’ అంటూ బీజేపీ, మోదీపై విరుచుకుపడ్డారు.

మరిన్ని వార్తలు