సాక్షి, హైదరాబాద్ : జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అకుంటిత దీక్షతో నిరంతరం శ్రమించే చేనేత కార్మికుల కష్టనష్టాలను తీర్చడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. కాగా, వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రకు విశేషస్పందన లభిస్తున్న సంగతి తెలిసిందే.
అన్ని రంగాలకు చెందిన ప్రజలు పాదయాత్రతో తమ చెంతకు వస్తున్న వైఎస్ జగన్ను కలసి వారి గోడును వెళ్లబోసుకుంటున్నారు. వారి బాధలను కష్టనష్టాలను జననేతతో పంచుకుంటున్నారు.
Prosperity of our skilled and hard-working weaving community is my priority. #NationalHandloomDay pic.twitter.com/wKYwYiPr33
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2018