‘మోదీ, అంబానీ పేర్లు బయటకొస్తాయి’

15 Nov, 2018 03:12 IST|Sakshi

కబీర్‌దాం/కోర్బా: రఫేల్‌ విమానాల కొనుగోలు ఒప్పందంపై నిష్పాక్షిక దర్యాప్తు జరిగితే ప్రధాని మోదీ, వ్యాపారవేత్త అంబానీల పేర్లు త్వరలో బయటకు వస్తాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండవ విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ మాట్లాడారు. ‘రఫేల్‌ కుంభకోణంపై సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌వర్మ దర్యాప్తు ప్రారంభించారు. అయితే అర్థరాత్రి 12 గంటలకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రధానమంత్రి ఆయనను తొలగించారు. ఒకరోజు తప్పకుండా ఆ రెండు పేర్లు బయటకు వస్తాయి. ఆ పేర్లు ప్రధాని నరేంద్రమోదీ, అనిల్‌ అంబానీ’’అని రాహుల్‌ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు