‘మోదీ విద్వేష విషం విరజిమ్మారు’

12 May, 2019 11:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ విద్వేషపూరిత ప్రచారానికి మొగ్గుచూపారని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఆరోపించారు. మోదీ ద్వేషాన్ని విరజిమ్మితే తాము ప్రేమను పంచామని, ఈ ఎన్నికల్లో ప్రేమే గెలుస్తుందని తాను నమ్ముతున్నానని రాహుల్‌ వ్యాఖ్యానించారు.

ఢిల్లీలోని ఔరంగజేబు లేన్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం రాహుల్‌ మాట్లాడారు. ఈ ఎన్నికల్లో నోట్ల రద్దు, రైతు సమస్యలు, గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌, రఫేల్‌ ఒప్పందంలో అవినీతి వంటి అంశాలు కీలక పాత్ర పోషించాయని అన్నారు.

మరిన్ని వార్తలు