ఏపీ బీజేపీ మంత్రుల రాజీనామాలు ఒట్టిదే!

7 Mar, 2018 21:07 IST|Sakshi

అన్ని పార్టీతలో స్నేహంగా ఉంటా.. అందుకే కొన్ని సార్లు నాపై దుష్ప్రచారం

మంత్రి కామినేని శ్రీనివాస్‌ వ్యాఖ్యలు

సాక్షి, విజయవాడ : కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అభివృద్ధికాముకులని మంత్రి కామినేని శ్రీనివాస్‌ కితాబిచ్చారు. కేంద్రంలో టీడీపీ మంత్రులు, ఏపీ కేబినెట్‌లోని బీజేపీ మంత్రులు రాజీనామాలు చేస్తారన్న ప్రచారం ఒట్టిదేనని తేల్చిచెప్పారు. బుధవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘‘నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం బీజేపీ అధిష్టానమే. మా నయకులు ఏం చెయ్యమని ఆదేశిస్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే, బీజేపీ మంత్రులు రాజీనామా చేస్తారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవంలేదు. అన్ని పార్టీలవారితో నేను స్నేహంగా ఉంటాను. ఆ కారణం వల్లే నాపై కొన్నిసార్లు నాపై దుష్ర్పచారం జరుగుతుంది. భవిష్యత్తులో టీడీపీతో పొత్తు ఉంటుందా, లేదా అన్నది అధిష్టానమే నిర్ణయిస్తుంది’ అని మంత్రి కామినేని అన్నారు.

>
మరిన్ని వార్తలు