వంద గెలుస్తడో.. ఆయన బొంద గెలుస్తడో

7 Sep, 2018 02:40 IST|Sakshi

కేసీఆర్‌ది ముందస్తు ఆత్మహత్య: రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌/కొడంగల్‌: తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి కేసీఆర్‌ ముందస్తుగా ఆత్మహత్య చేసుకున్నారని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. ముందస్తు ఎన్నికలతో కేసీఆర్‌ వంద గెలుస్తడో.. ఆయన బొంద గెలుస్తడో ప్రజలే తేల్చుతారని ఎద్దేవా చేశారు. గురువారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడుతూమేనిఫెస్టోలో చెప్పిన హామీలేవీ కేసీఆర్‌ అమలు చేయలేకపోయారని విమర్శించారు.

పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే ఆయన ప్లాన్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో అందరూ దొంగలేనని, సిరిసిల్లలో కేసీఆర్‌ కొడుకు కేటీఆర్‌ ఇసుక దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు.  కొడంగల్‌ ఎమ్మెల్యే పదవికి రేవంత్‌ గురువారం రాజీనామా చేశారు. స్పీకర్‌ ఫార్మాట్‌లోని రాజీనామా లేఖను స్పీకర్‌ మధుసూదనాచారికి అందజేయగా తీసుకునేందుకు ఆయన నిరాకరించారు. దీంతో లేఖను ఆయన పీఏకు అందజేసినట్లు రేవంత్‌ తెలిపారు.

>
మరిన్ని వార్తలు