సాక్షి, హైదరాబాద్: తనకు పట్నం మహేందర్రెడ్డి, నరేందర్రెడ్డి పోటీ కాదని.. కేసీఆరే పోటీ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి అన్నారు. కేసీఆర్కు దమ్ముంటే కొడంగల్ నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. టీఆర్ఎస్కు ఓటు వేయాలని కోస్గి సీఐ కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. బైండోవర్ కేసుల పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారన్నారు. హైకోర్టు తనకు 4+4 భద్రత కల్పించాలని ఆదేశించినా పోలీసు శాఖ ఉల్లంఘించిందని వ్యాఖ్యానించారు.
గురువారం సచివాలయంలో సీఈఓ రజత్ కుమార్ను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నేతలకు అధికారులు వత్తాసు పలికితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత బదులు తీర్చుకుంటామన్నారు. ఇప్ప టి వరకు సీఈఓకు చేసిన ఫిర్యాదులపై ఒక్క దాని మీద కూడా విచారణ జరిపించలేదన్నారు. డిసెంబర్ 7 లోపు ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఉద్ఘాటిం చారు.