మద్యం ధరల పెంపు వెనుక ఓ ఎంపీ!

18 Dec, 2019 03:27 IST|Sakshi

బహిరంగ లేఖలో ఎంపీ రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న మద్యం ధరల పెంపు నిర్ణయం వెనుక భారీ కుంభకోణం ఉందని మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం ఉత్పత్తి, పంపిణీ, అమ్మకాల వరకు మాఫియా గుప్పిట్లో ఉందని, తాజా మద్యం ధరల పెంపు విషయంలో అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ ఢిల్లీ, చెన్నైలలో మకాం వేసి బేరం కుదిర్చారని అన్నారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐతో విచారణ జరిపించాలని మంగళవారం ఆయన రాసిన బహిరంగ లేఖలో కోరారు. వెంటనే పెంచిన మద్యం ధరలను ఉపసంహరించుకోవాలని, లేదంటే న్యాయస్థానాల ద్వారా సీబీఐ విచారణ కోసం పోరాడుతామని లేఖలో రేవంత్‌ వెల్లడించారు. ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ శాఖ.. ఎక్సైజ్‌ అండ్‌ ప్రమోషన్‌ శాఖగా మారిందని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు