2019లోనే అసెంబ్లీ ఎన్నికలు పెడ్తారా?

7 Jun, 2018 04:42 IST|Sakshi

లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనల్లో ఒకటైన ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’కు తాము సిద్ధంగానే ఉన్నామని ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. అయితే, 2019లో ఉత్తరప్రదేశ్‌లో కూడా శాసనసభ, లోక్‌సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి మీరు సిద్ధమేనా అని బీజేపీకి ఆయన సవాలు విసిరారు. లక్నోలోని పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఆధార్‌ నంబరుతో ఓటర్లను అనుసంధానించడంలోగానీ, ఒకేసారి ఎన్నికల ప్రతిపాదనపై గానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. 2019లో ఒకేసారి ఎన్నికల్లో భాగంగా యూపీ శాసన సభకు కూడా ఎన్నికలు నిర్వహించమని బీజేపీని అడుగుతున్నాను’’అని అన్నారు.

>
మరిన్ని వార్తలు