పసుపు, కుంకుమ పేరిట భారీగా చీరల పంపిణీ!

30 Mar, 2019 20:32 IST|Sakshi

సాక్షి, చిత్తూరు : జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. పసుపు, కుంకుమ పేరిట చీరలు పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నారు. రామచంద్రాపురం మండలంలో ఆటోలో చీరలు తరలిస్తూ ఓటర్లకు పంచేందుకు సిద్ధపడ్డారు. టీడీపీ నాయకులు ఆటోలలో చీరలు తరలిస్తుండగా కునేపల్లిలో స్థానికులు అడ్డుకున్నారు. చీరలతో వెళుతున్న ఆటోను అడ్డుకోవడంతో టీడీపీ కార్యకర్తలు స్థానికులతో గొడవకు దిగారు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మాత్రం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు