సాక్షి, హైదరాబాద్: రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కె.చంద్రశేఖర్రావుకు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం ప్రగతిభవన్లో సీఎంను ఆయన కలిశారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తితో ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాడాలన్నారు. తెలుగు వారి భాషా సంస్కృతులను కాపాడటంలో ఒక తెలుగు నేతగా ముందుండాలని కోరారు.