బీజేపీలోకి 107 మంది ఎమ్మెల్యేలు

14 Jul, 2019 05:56 IST|Sakshi

బెంగాల్‌ బీజేపీ నేత ముకుల్‌ రాయ్‌ సంచలన వ్యాఖ్య

కోల్‌కతా: బెంగాల్‌లోని తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ), కాంగ్రెస్, సీపీఎంలకు చెందిన 107 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ నేత ముకుల్‌ రాయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోని పలువురు టీఎంసీ నేతలు మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీపై నమ్మకాన్ని కోల్పోయారని, ఆ పార్టీ విధానాలతో వారు విసుగుచెందారని శనివారం ఆయన విలేకరులకు తెలిపారు. పలువురు టీఎంసీ కౌన్సిలర్లు బీజేపీలోకి వచ్చి, వెంటనే తిరిగి టీఎంసీలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో ముకుల్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత టీఎంసీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, సీపీఎంల నుంచి ఒక్కొక్కరు చొప్పున బీజేపీలో చేరారు. 

మరిన్ని వార్తలు