ప్రత్యేకత చాటుకుంటున్నషాద్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్
రంగారెడ్డి పరిధిలో ఎమ్మెల్యే, మహబూబ్నగర్ జిల్లాలో లోక్సభ స్థానం
1952లో మహబూబ్నగర్ను లోక్సభ నియోజకవర్గంగా ఏర్పాటుచేశారు. అప్పట్లో షాద్నగర్ మహబూబ్నగర్ లోక్సభ పరిధిలోనే ఉండేది. ఆ తర్వాత 1967లో నాగర్కర్నూల్ పార్లమెంట్ కేంద్రంగా ఏర్పాటుచేసి షాద్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ను దానిలో కలిపారు. అప్పటి నుంచి 2004 వరకు నాగర్కర్నూల్ పరిధిలోనే షాద్నగర్ ఉండేది. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో నాగర్కర్నూల్, పరిగి, కొడంగల్, అచ్చంపేట, షాద్నగర్ నియోజకవర్గాలు ఉండేవి. అయితే 2009లో తిరిగి షాద్నగర్ను మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోకి తెచ్చారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా మహబూబ్నగర్ పరిధిలో షాద్నగర్ ఉంది. అయితే 2016లో టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటుచేసింది. షాద్నగర్ నియోజకవర్గాన్ని మహబూబ్నగర్ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాలో కలిపేశారు.
అసెంబ్లీ రంగారెడ్డి, లోక్సభ మహబూబ్నగర్లో
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా పరిధిలో ఓటువేసిన షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లు లోక్సభ ఎన్నికలకు మాత్రం ఓటును మహబూబ్నగర్ జిల్లా నుంచి వేస్తున్నారు. దీంతో షాద్నగర్ రెండు జిల్లాల రాజకీయాలకు వారధిగా మారింది. పలు సందర్భాల్లో ఎంపీల గెలుపోటములను శాసించిన ఘనత ఈ నియోజకవర్గానికి ఉంది.
పార్లమెంట్ ఎన్నికల్లో షాద్నగర్
ప్రత్యేక శ్రద్ధ
షాద్నగర్ నియోజకవర్గంలో వలస కార్మికులు, గ్రామీణ ప్రాంతం వారు ఎక్కువ ఉండడంతో ఎంపీ అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు షాద్నగర్ నియోజకవర్గానికి అభ్యర్థులు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. హైదరాబాద్కు సమీపంలో ఉండడంతో ఆయా పార్టీల అధినేతలు, ముఖ్య నాయకులు ఎన్నికల సమయంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.