ఈ ఫలితాలు బీజేపీకి చెంపపెట్టు : శివసేన

11 Dec, 2018 16:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి స్పష్టమైన సంకేతం పంపాయని, పాలక సంకీర్ణం ఈ ఫలితాలను విశ్లేషించుకోవాలని శివసేన పేర్కొంది. బీజేపీ విజయపరంపరకు అడ్డుకట్ట పడిందని ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని రాజ్యసభ ఎంపీ, శివసేన ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు.

ఎన్డీఏ కూటమి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన తరుణం ఇదని ఆయన పేర్కొన్నారు. ఎన్డీఏలో శివసేన మిత్రపక్షంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాజస్ధాన్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పాలక బీజేపీ ప్రతికూల ఫలితాలు ఎదురవగా, మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ దిశగా ఆధిక్యం కనబరుస్తోంది. తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ మరోసారి పాలనాపగ్గాలు చేపట్టేలా అఖండ విజయం సాధించగా, మిజోరంలో పాలక కాంగ్రెస్‌ను మట్టికరిపించి మిజో నేషనల్‌ ఫ్రంట్‌ స్పష్టమైన మెజారిటీ సాధించింది.

మరిన్ని వార్తలు