హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌

20 Nov, 2018 13:52 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: జిల్లాలోని హుజురాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. టికెట్‌ దక్కకపోవడంతో టీపీసీసీ అధికార ప్రతినిధి తుమ్మేటి సమ్మిరెడ్డి, సీనియర్‌ నాయకుడు పరిపాటి రవీందర్‌రెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పి గూలాబీ గూటికి చేరారు. మంత్రి ఈటల రాజేందర్‌ సమక్షంలో వారు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ పాడి కౌశిక్‌రెడ్డికి ఇవ్వడం పట్ల అసంతృప్తితోనే తాము పార్టీ మారామని నేతలు చెప్తున్నారు.

ఇక హుస్నాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ రెబల్‌ అభ్యర్థి ఆల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి నామినేషన్‌ను ఎలక్షన్‌ అధికారులు తిరస్కరించారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున నామినేషన్‌ దాఖలు చేసిన ప్రవీణ్‌రెడ్డి పార్టీ బీఫారం సమర్పించకపోవడంతో ఆయన నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. మహాకూటమి పొత్తులో భాగంగా హుస్నాబాద్‌ స్థానాన్ని కాంగ్రెస్‌ సీపీఐకి ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు