జగదాంబిక పాల్ రికార్డ్ సమం చేసిన యడ్యూరప్ప
సాక్షి, హైదరాబాద్: చివరివరకూ ఉత్కంఠ భరితంగా సాగిన కర్ణాటక రాజకీయాలకు క్లైమాక్స్లో బీజేపీ నేత యడ్యూరప్ప అనూహ్య ట్విస్ట్ ఇచ్చారు. కేవలం మూడు రోజుల వ్యవధిలో సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసందే. అనంతరం గవర్నర్ వజుభాయ్ వాలాకు రాజీనామా లేఖ సమర్పించారు. తద్వారా భారతదేశ ముఖ్యమంత్రులలో అతి తక్కువ రోజులు సీఎంగా ఉన్న ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేత జగదాంబికా పాల్ సరసన చేరారు. ఈ నెల 17న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప 19న (శనివారం) రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
భారతదేశ రాజకీయాల్లో గతంలో కొన్ని పార్టీల నేతలు రాజకీయ సంక్షోభాల కారణంగా పదవి నుంచి తప్పుకున్నారు. విశ్వాస పరీక్షలో నెగ్గకపోవడం, ఇతర పార్టీల మద్దతు లభించకపోవడంతో పలువురు ముఖ్యమంత్రులు రాజీనామాలు చేశారు.
అతి తక్కువ రోజులు సీఎంగా చేసిన నేతలు వీరే....