చంద్రబాబుపై సోమువీర్రాజు మండిపాటు

18 Mar, 2018 15:09 IST|Sakshi

సాక్షి, విజయవాడ: తమ పార్టీపై టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని త్వరలోనే తిప్పికొడతామని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 600కు పైగా హామీలపై చంద్రబాబును ఎండగడుతామంటూ సోము వీర్రాజు మండిపడ్డారు. విజయవాడలో ఆయన ఆదివారం ఇక్కడి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై ఏపీ సర్కార్ తప్పుడు ఆరోపణలు చేస్తుందన్నారు. త్వరలో జరగనున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేస్తామన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏమేం చేసిందో తాము అప్పుడు చెబుతామని ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు