ప్రభుత్వ అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు చేస్తాం

15 Jun, 2018 14:29 IST|Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం : రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన పథకాల్లో భారీ అవినీతి చోటుచేసుకుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీరు-చెట్టు, హౌసింగ్‌లో జరిగిన అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు చేస్తామన్నారు. చంద్రబాబు పులి మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టే.. కేవలం హౌసింగ్‌లోనే 30 కోట్ల దోపిడి జరిగిందని ఆరోపించారు. మరో పదిలక్షల ఇళ్లు మంజూరు చేస్తే లక్ష కోట్ల కుంభకోణం జరిగేదని వ్యాఖ్యానించారు. మరో సంపూర్ణ విప్లవం రావాలని.. లేదంటే చంద్రబాబుతో ప్రమాదమని తెలిపారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ను కచ్చితంగా ఏర్పాటు చేస్తామన్నారు. కానీ రాష్ట్ర  ప్రభుత్వం సహకరించడం లేదన్నారు.

మరిన్ని వార్తలు