‘ప్రజ్ఞ పోటీ చేయకుండా నిషేధించలేం’

25 Apr, 2019 05:10 IST|Sakshi

ముంబై: భోపాల్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ను ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా నిషేధం విధించాలంటూ వచ్చిన పిటిషన్‌ను ముంబైలోని ఎన్‌ఐఏ కోర్టు తిరస్కరించింది. ఆ అధికారం తమకు లేదనీ, ఎన్నికల అధికారులే ఆ పని చేయగలరంది. మాలేగావ్‌ పేలుళ్లలో తన కొడుకును కోల్పోయిన నిసార్‌ సయ్యద్‌ ఈ పిటిషన్‌ వేశారు. ఈ పేలుళ్ల సూత్రధారి ప్రజ్ఞా సింగేననే ఆరోపణలు ఉన్నందున ఆమె ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని ఆయన కోరారు. ఆమెకు మంజూరయిన బెయిల్‌ను కూడా రద్దు చేయాలన్నారు. ఎన్‌ఐఏ ప్రత్యేక జడ్జి వీఎస్‌ పడాల్కర్‌ ఆ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ‘మాకు అలాంటి అధికారం లేదు. ఎన్నికల్లో పోటీచేయకుండా మేం ఎవ్వరిపైనా నిషేధం విధించలేం’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు