నేడు నెక్లెస్‌రోడ్‌లో నీరాకేఫ్‌కు శంకుస్థాపన 

23 Jul, 2020 04:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డులో నీరా కేఫ్‌కు నేడు శంకుస్థాపన జరగనుందని, గీత కార్మికుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచేందుకే ఈ కేఫ్‌లను ఏర్పాటు చేస్తున్నామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు. గత ప్రభుత్వాలు గౌడ వృత్తిదారులు కట్టే పన్నును మాత్రమే చూశాయని, వారి సంక్షేమాన్ని మరిచాయని మంత్రి విమర్శించారు. మంత్రి కేటీఆర్‌ చేతుల మీదు గా జరిగే ఈ నీరాకేఫ్‌ శంకుస్థాపనకు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కూడా హాజరవనున్నారు. శంకుస్థాపన ఏర్పాట్లను బుధవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆ శాఖ అధికారులు, గౌడ సంఘాలనేతలతో కలిసి పరిశీలించారు. 

మరిన్ని వార్తలు