రాహుల్‌జీ.. కాస్త మంచి భాష వాడండి

7 Apr, 2019 05:27 IST|Sakshi

న్యూఢిల్లీ: పార్టీ అగ్ర నేత ఎల్‌కే అడ్వాణీపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ తన ప్రసంగాల్లో కాస్త మంచి భాష వాడాలని సీనియర్‌ నేత సుష్మా స్వరాజ్‌ కోరారు. శుక్రవారం మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్‌ మాట్లాడుతూ..‘బీజేపీ హిందూత్వ గురించి మాట్లాడుతుంది. హిందుత్వలో గురువే ప్రముఖుడు. గురు–శిష్య సంబంధం గురించి గొప్పగా ఉంటుంది. మోదీకి ఎవరు గురువు? అడ్వాణీ. అలాంటి అడ్వాణీని వేదికపై నుంచి నెట్టిపడేశారు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ సీనియర్‌ నేత సుష్మాస్వరాజ్‌ ట్విట్టర్‌లో తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. ‘అడ్వాణీజీ మాకు తండ్రి సమానులు. మీ మాటలతో మా హృదయాలు గాయపడ్డాయి. దయచేసి, మీ ప్రసంగాల్లో కాస్త మంచి భాష వాడండి’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు