చంద్రబాబు గగ్గోలుపెట్టడం హాస్యాస్పదంగా ఉంది: పృథ్వీరాజ్‌

5 Jan, 2020 16:53 IST|Sakshi

సాక్షి, ఒంగోలు: రైతుల పక్షాన పోరాటం చేస్తున్నానని.. రైతు శ్రేయస్సే ముఖ్యమని టీడీపీ అధినేత చంద్రబాబు గగ్గోలుపెట్టడం హాస్యాస్పదంగా ఉందని ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్విరాజ్ విమర్శించారు. ఆదివారం ప్రకాశం జిల్లా ఒంగోలులో పర్యటించిన ఆయన.. అమరావతిలో ఆందోళనలపై స్పందించారు. చంద్రబాబు పెయిడ్ ఆర్టిసుల చేత నిరసన ప్రదర్శనలు చేస్తున్నారే తప్ప... అసలైన రైతులెవ్వరూ ఆయన పక్షాన లేరని స్పష్టం చేశారు. రైతు పక్షపాతి అని తనకు తాను కితాబు ఇచ్చుకుంటున్న బాబు.. గత టీడీపీ పాలనలో రైతులకు ఏం చేశారని నిలదీశారు..

మరిన్ని వార్తలు