8న తమిళసై, 11న దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం

4 Sep, 2019 12:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా తమిళసై సౌందర్‌ రాజన్‌ ఈ నెల 8వ తేదీ 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు.  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎస్‌ చౌహాన్‌  ఆదివారం ఉదయం ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు, పలువురు ఉన్నత అధికారులు హాజరు కానున్నారు. మరోవైపు కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకుడు బండారు దత్తాత్రేయ ఈ నెల 11వ తేదీన హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. 


 

మరిన్ని వార్తలు