సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో జనాభా దామా షాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్ని పార్టీలు టికెట్లు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్)కు ఆదరణ పెరుగుతోందన్నారు.
బీఎల్ఎఫ్ పక్షాన రానున్న ఎన్నికల్లో 119 స్థానాలకు పోటీ చేస్తామని.. ఈ సారి ఎక్కువ మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సీట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్తో పొత్తు ప్రసక్తే లేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అవినీతిపై ప్రశ్నిస్తున్న పవన్ కలసి పనిచేద్దామని తమతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు.