పశ్చిమలో టీడీపీకి షాక్‌..

9 Jun, 2019 11:50 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి :  రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు తయారవుతోంది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న ఆ పార్టీకి తాజాగా పశ్చిమ గోదావరిలో షాకింగ్‌ పరిణామం ఎదురయింది. తణుకు టీడీపీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం రెండు వందల మంది కార్యకర్తలతో కలిసి తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారి బాటలోనే.. మరో పదిహేను మంది కౌన్సిలర్లు కూడా వైఎస్సార్‌సీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే పార్టీలో చేరేవారు తమ కౌన్సిలర్‌ పదవులకు రాజీనామా చేసి రావాల్సిందిగా కారుమూరి కోరారు.

ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాణాలు టీడీపీకి మింగుడు పడటం లేదు. చంద్రబాబు ప్రకటించిన పార్లమెంటరీ పార్టీ పదవులపై విజయవాడ ఎంపీ కేశినేని నాని అలక వహించి ఫేస్‌బుక్‌లో వెటకారంగా పోస్టులు పెట్టడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పలువురు నేతలు పార్టీని వీడనున్నట్టు వార్తలు రావడం టీడీపీలో కలకలం రేపుతోంది. 

మరిన్ని వార్తలు