చంద్రబాబు నివాసంలో టీడీఎల్పీ సమావేశం

11 Jun, 2019 12:40 IST|Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నివాసంలో మంగళవారం టీడీఎల్పీ సమావేశమైంది. ఈ సమావేశానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమిమిపై సమీక్ష జరిపినట్లు సమాచారం. టీడీఎల్పీ ఉపనేత, విప్‌ల ఎంపికపైన సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి పాలనలో దూకుడు చూపిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని అసెంబ్లీలో ఎలా ఎదుర్కొందామనే అంశంపై తీవ్రంగా చర్చజరిపినట్లు సమాచారం.
 

>
మరిన్ని వార్తలు