ఎంపీ నందిగం సురేశ్‌పై దాడికి యత్నం

2 Feb, 2020 13:00 IST|Sakshi

సాక్షి, విజయవాడ : దళిత ఎంపీ, వైఎస్సార్‌సీపీ నాయకుడు నందిగం సురేశ్‌పై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. జై అమరావతి అనాలంటూ ఎంపీ సురేశ్‌పై టీడీపీ సోషల్‌ మీడియా ప్రతినిధి అజయ్‌ చౌదరి, మరికొందరు టీడీపీ కార్యకర్తలు ఒత్తిడి తెచ్చారు. ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే మా పార్టీ స్టాండ్‌ అని ఎంపీ సురేశ్‌ స్పష్టం చేశారు. దీంతో వాహనాన్ని చుట్టుముట్టిన టీడీపీ నేతలు దానిని ధ్వంసం చేసేందుకు యత్నించారు. నందిగామాలో ఓ వైద్యుడిని కలిసేందుకు ఎంపీ సురేశ్‌ వెళ్లిన క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

మరిన్ని వార్తలు